కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్ష–కార్యదర్శులుగా మెరుగు చంద్రమోహన్, ముత్యం ముఖేష్ గౌడ్

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కాప్రా, ఫిబ్రవరి 25 ( తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు బుధవారం టిఎస్ఐఐసీ కాలనీలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో సభ్యుల సమక్షంలో కమిటీని ప్రకటించారు.సలహాదారులుగా ఏంపల్లి పద్మారెడ్డి, బెలిదే అశోక్‌లను ఎన్నుకోగా, అధ్యక్షుడిగా మెరుగు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శిగా ముత్యం ముఖేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా దిలీప్ కుమార్, యావాపురం రవి, దొమ్మాటి కిరణ్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్ రావు బాధ్యతలు స్వీకరించారు. సంయుక్త కార్యదర్శులుగా డి. శ్రీనివాస్, కె. వెంకట్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఓ. నరసింహ, కీర్తి శ్రీనివాస్, కోశాధికారిగా రామచంద్రమూర్తి, కార్యవర్గ సభ్యులుగా గంగి కృష్ణ, గోవిందు కుంట్ల ఆంజనేయులు, బుడంపల్లి నిరంత్ గౌడ్, తొడుపునూరు బాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మెరుగు చంద్రమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ సభ్యుల ఐక్యతతో ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కోశాధికారి రామచంద్రమూర్తి పారదర్శక ఆర్థిక నిర్వహణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీకి అభినందనలు నూతన కమిటీకి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారితో పాటు కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో కమిటీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.IMG-20260225-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సిఎంగా  కొనసాగుతారు – తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి హైదరాబాద్,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):...
అగ్రకుల కులోన్మాదం అరికట్టకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది
నాగవరం ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్’ పై మోటివేషన్ కార్యక్రమం
మేఘన్న అభయ హస్తం – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
పిల్లల ఆహారంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు
ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు ఎంపీ ఈటల ను మర్యాదపూర్వకంగా కలిసారు
వల్లభాపూర్‌లో కల్లు గీత సంఘం ఎన్నికలు విజయవంతం