కీసరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.
339 మంది విద్యార్థులు హాజరు
కీసర, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యాయి. కీసరలోని శ్రద్ధ కళాశాల పరీక్షా కేంద్రంలో మొదటి రోజు 339 మంది విద్యార్థులు హాజరయ్యారు.పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, హాల్ టికెట్ మరియు గుర్తింపు కార్డులు పరిశీలించిన అనంతరం మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.పరీక్షలు ఉదయం సమయానికి ప్రారంభం కాగా, 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు చివరి నిమిషంలో కేంద్రానికి చేరుకున్న కొందరు విద్యార్థులు కంగారుపడుతూ హాళ్లకు చేరుకున్నారు. కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు.


Comments