చర్లపల్లి పీఏసీలో ఆయుర్వేద గ్రామం పునఃప్రారంభం ఖైదీలకు వెల్‌నెస్‌, థెరపీ శిక్షణ 

కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ ప్రారంభం

చర్లపల్లి పీఏసీలో ఆయుర్వేద గ్రామం పునఃప్రారంభం ఖైదీలకు వెల్‌నెస్‌, థెరపీ శిక్షణ 

చర్లపల్లి, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

ఖైదీల సంక్షేమం, పునరావాసానికి తోడ్పడే దిశగా చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ (పీఏసీ)లో ఆయుర్వేద గ్రామం మరియు కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా బుధవారం ప్రారంభించారు. ఆరు సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని తిరిగి ప్రారంభించడం ప్రత్యేకత సంతరించుకుంది.ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, ఆయుర్వేద గ్రామం ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆయుర్వేద చికిత్సలు అందించడమే కాకుండా ఖైదీలకు వెల్‌నెస్, థెరపీ సేవలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన ఖైదీలు విడుదల అనంతరం స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు.జైలు శాఖలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌లో సంప్రదాయ పద్ధతిలో రసాయనాలు లేకుండా నూనెల తయారీ చేపట్టనున్నారు. ఈ యూనిట్ ద్వారా తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ వంటి అంశాల్లో ఖైదీలకు ప్రాయోగిక శిక్షణ ఇవ్వనున్నారు.ఈ రెండు కేంద్రాల ప్రారంభంతో ఖైదీల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జైలు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో డీఐజీలు IMG-20260225-WA0039డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎం. ఖాలిద్ అక్తర్, సూపరింటెండెంట్లు డి. భారత్, జి. ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, జైలు అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సిఎంగా  కొనసాగుతారు – తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి హైదరాబాద్,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):...
అగ్రకుల కులోన్మాదం అరికట్టకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది
నాగవరం ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్’ పై మోటివేషన్ కార్యక్రమం
మేఘన్న అభయ హస్తం – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
పిల్లల ఆహారంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు
ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు ఎంపీ ఈటల ను మర్యాదపూర్వకంగా కలిసారు
వల్లభాపూర్‌లో కల్లు గీత సంఘం ఎన్నికలు విజయవంతం