మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం
హైదరాబాద్,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు):
హిమాయత్నగర్లోని మేల్కోటే పార్క్లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మార్చి 14న మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దళిత, బహుజన, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మహనీయుల ఆశయాలను విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర సమన్వయకర్త గాదె వెంకట్, డాక్టర్ బొమ్మెర స్టాలిన్, మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కలగడ్డ చంద్రశేఖర్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, తాళ్ల సునీల్, తాళ్ల అజయ్, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు జోగు గణేష్, చాగంటి శేఖర్, చనుంపల్లి కిరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments