ప్రజాప్రతినిధులకు ఈనెల 12న శిక్షణ కార్యక్రమం

ప్రజాప్రతినిధులకు ఈనెల 12న శిక్షణ కార్యక్రమం

_99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించాలని 

_సీఎస్ రామకృష్ణరావు ఆదేశాలు

మేడ్చల్–మల్కాజిగిరి,మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణా కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె. శ్రీదేవి, సెర్ప్ సీఈఓ దివ్య, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపల్ సంస్థలు ఉండగా దాదాపు 15 వేల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనను వేదిక వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఇప్పటి వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా సూచించారు.IMG-20260310-WA0126

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!