చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా

ఇద్దరిపై కేసు నమోదు, ట్రాక్టర్లు స్వాధీనం

చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా

పెద్దమందడి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): 

ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిపై పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు.వివరాల్లోకి వెళితే… మార్చి 16, 2026 తెల్లవారుజామున పెద్దమందడి మండల పరిధిలోని చిలుకటోనిపల్లి వాగు నుండి రాత్రి సమయంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను రెండు ట్రాక్టర్లలో తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా చిలుకటోనిపల్లి గ్రామానికి చెందిన భాజ శీను మరియు కనిమెట్ట గ్రామానికి చెందిన బోయ సుధాకర్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి పై కేసు నమోదు చేసి, ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జలంధర్ రెడ్డి హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం