శ్రీ ఆదర్శ విద్యార్థికి జవహర్ నవోదయలో సీటు
Views: 8
On
ఖమ్మం బ్యూరో, మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న లింగం భువనేశ్వరి జవహర్ నవోదయలో సీటు సాధించింది. జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు దేశవ్యాప్తంగా డిసెంబర్ 13న జరిగాయి. ఈరోజు పరీక్ష ఫలితాలు వెలుబడ్డాయి. ఈ పరీక్షలో లింగం భువనేశ్వరి అత్యంత ప్రతిభ కనపరిచి 88.75 మార్కులతో జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధించింది. భువనేశ్వరి తండ్రి లింగం కొండలరావు నాగులవంచలో ఓ ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల మేనేజ్మెంట్ , ఉపాధ్యాయులు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Mar 2026 22:28:09
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...


Comments