ఈదురుగాలులకు నేలమట్టమైన పంటలు ప్రభుత్వం ఆదుకోవాలని వేలేరు రైతుల విజ్ఞప్తి

ఈదురుగాలులకు నేలమట్టమైన పంటలు ప్రభుత్వం ఆదుకోవాలని వేలేరు రైతుల విజ్ఞప్తి

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి వీచిన ఈదురుగాలుల ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. బలమైన గాలులు వీచడంతో మండలంలోని అనేక గ్రామాల్లో మొక్కజొన్న మరియు వరి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో ఎకరాల కొద్దీ సాగుచేసిన మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి భారీ నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పంటలు సాగుచేసిన రైతులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

నష్టపోయిన పంటలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, అలాగే నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వేలేరు మండల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం