పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం
Views: 1
On
పెద్దమందడి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును గ్రామ కాంగ్రెస్ నాయకులు మధిర శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.సర్వ మానవాళి శ్రేయస్సు కోసం 30 రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిక్కన్న సిద్దయ్య, మాజీ ఎంపిటిసి ఇంద్ర లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు రాములమ్మ, నరేష్, లక్ష్మి, రాజ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Mar 2026 22:28:09
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...


Comments