ఉపాధ్యాయుడు మట్టా అజయ్ కుమార్కు ఘన సన్మానం.!
- సత్తుపల్లిలో పదవీ విరమణ సందర్భంగా అభినందనలు.
- కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా పాల్గొన్నారు.
సత్తుపల్లి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన మట్టా అజయ్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ హాజరై అజయ్ కుమార్ను శాలువా కప్పి సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు కార్యక్రమంలో పాల్గొని అజయ్ కుమార్ను అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతర జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం
లో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు, గాదె చెన్నారావు, నాయుడు వెంకటేశ్వరరావు, మట్టా ప్రసాద్, దొడ్డా రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


Comments