ఉపాధ్యాయుడు మట్టా అజయ్ కుమార్‌కు ఘన సన్మానం.!

ఉపాధ్యాయుడు మట్టా అజయ్ కుమార్‌కు ఘన సన్మానం.!

- సత్తుపల్లిలో పదవీ విరమణ సందర్భంగా అభినందనలు.
- కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా పాల్గొన్నారు.

సత్తుపల్లి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన మట్టా అజయ్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ హాజరై అజయ్ కుమార్‌ను శాలువా కప్పి సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు కార్యక్రమంలో పాల్గొని అజయ్ కుమార్‌ను అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతర జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంIMG-20260311-WA0087లో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు, గాదె చెన్నారావు, నాయుడు వెంకటేశ్వరరావు, మట్టా ప్రసాద్, దొడ్డా రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు): భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...
ఏడాది పూర్తి చేసుకున్న పెద్దమందడి ప్రెస్ క్లబ్
మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి 
మల్కాజిగిరిలో నేడు మహిళా జన్ సున్వాయ్
ఉత్తమ ఎంఈఓగా రాజేశ్వరరావుకు అవార్డు.!
వేం నరేందర్ రెడ్డికి ఉప్పల్ కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే బండారి