సాయి కృష్ణ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Views: 2
On
ఉప్పల్, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాయి కృష్ణ నగర్ కాలనీలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు తదితర అభివృద్ధి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Mar 2026 21:16:56
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...


Comments