వెల్టూర్ గ్రామంలో గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు

వెల్టూర్ గ్రామంలో గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు

పెద్దమందడి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో పశువుల ఆరోగ్య రక్షణ కోసం గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది గ్రామంలోని రైతుల గేదెల వద్దకే వెళ్లి టీకాలు వేసి సేవలు అందించారు.గాలికుంటు వ్యాధి పశువుల్లో త్వరగా వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ టీకాలు వేయడం ఎంతో ముఖ్యమని పశువైద్య సిబ్బంది రైతులకు తెలిపారు.గ్రామంలోని పలు రైతుల గేదెలకు టీకాలు వేసి పశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ పాల్గొని పశువైద్య సిబ్బందితో కలిసి రైతులను ప్రోత్సహించారు.పశువుల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని సర్పంచ్ అశోక్ అన్నారు. ప్రతి రైతు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు.గ్రామంలో పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ప్రేమ్ సాగర్, పెద్ద శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు): భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...
ఏడాది పూర్తి చేసుకున్న పెద్దమందడి ప్రెస్ క్లబ్
మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి 
మల్కాజిగిరిలో నేడు మహిళా జన్ సున్వాయ్
ఉత్తమ ఎంఈఓగా రాజేశ్వరరావుకు అవార్డు.!
వేం నరేందర్ రెడ్డికి ఉప్పల్ కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే బండారి