హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునఃనిర్మాణానికి రూ.10 వేల విరాళం

హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునఃనిర్మాణానికి రూ.10 వేల విరాళం

కీసర, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం డివిజన్ పరిధిలోని వెంకులోనిగుట్టలో ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునఃనిర్మాణ పనులకు భక్తులు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీసర మాజీ వార్డు సభ్యులు తుడుం శ్రీనివాస్ దేవాలయ పునఃనిర్మాణం కోసం రూ.10,000 విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తుడుం శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.వెంకులోనిగుట్టలో ఉన్న ఈ పురాతన దేవాలయానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. దేవాలయ పునఃనిర్మాణానికి భక్తులు, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని దేవస్థాన ప్రతినిధులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు
_నిరాధార ఆరోపణలపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు _అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ కుషాయిగూడ, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ నియోజకవర్గం కాప్రా...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పాలి
నాచారంలో సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
సీనియర్ పాత్రికేయుడు వెంకటరమణారెడ్డి సంస్మరణ సభ 
వెల్టూర్ సర్పంచ్ అశోక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కాప్రా సర్కిల్‌లో దోమల బెడద తీవ్రం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్.!