కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు

కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు

కుషాయిగూడ, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుండి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు సౌకర్యంగా హైదరాబాద్ నుంచి పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని మహంకాళి, ఓంకారేశ్వర్, శారద శక్తిపీఠం, అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ వంటి పవిత్ర క్షేత్రాలను భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక బస్సు మార్చి 28న సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి బయలుదేరనుంది.
ఈ యాత్రకు టికెట్ ధర రూ.8,000గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్: 9959226145, 9603549388 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News