గాయపడిన మున్సిపల్ కార్మికురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి

ఎమ్మార్పీఎస్, మాదిగల ఐక్య నాయకుల డిమాండ్

గాయపడిన మున్సిపల్ కార్మికురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి

వనపర్తి ,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మున్సిపాలిటీకి చెందిన కార్మికురాలు అలివేలు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి మాదిగ కుల పెద్దలు ఆమెను పరామర్శించారు. స్థానిక నాయకుడు పరంజ్యోతి సమాచారం మేరకు వనపర్తిలోని సుధా నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న అలివేలును కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మోటార్ బైక్ ఢీకొనడంతో అలివేలు రెండు చేతుల మోచేతి భాగంలో విరిగినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాట్లాడుతూ గాయపడిన కార్మికురాలికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని, ఆమెకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని అధికారులను కోరారు.అలాగే స్థానిక మున్సిపల్ చైర్మన్ మరియు ఎమ్మెల్యే గారు వెంటనే ఆసుపత్రికి వచ్చి కార్మికురాలిని పరామర్శించి, ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంధం పరంజ్యోతి, గంధం నాగరాజు, రాజనగరం రాజేష్, గోపాలపేట నాగరాజు, కొమ్ము యేసోపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు