నిరుపేదలకు అండగా 'లైఫ్ లైన్ ఫౌండేషన్': 

రంజాన్ రేషన్ కిట్ల పంపిణీ

నిరుపేదలకు అండగా 'లైఫ్ లైన్ ఫౌండేషన్': 

​ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు)

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని నిరుపేద కుటుంబాలకు లైఫ్ లైన్ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. నగరంలోని 14వ డివిజన్ పరిధిలో ఉన్న గొల్లగూడెం మరియు రాజన్నపేట కాలనీలలో నివసిస్తున్న నిరుపేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్లను పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ జానీమియా మాట్లాడుతూ, పండుగ వేళ ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వాలంటీర్లు షేక్ నజీరుద్దీన్, షేక్ గౌస్ మియా, షేక్ నజీర్, షేక్ కన్నం సాహెబ్, షేక్ చిన్న జానీ మియా, షేక్ షరీఫ్, ఇమామ్, మదర్ సాహెబ్, జానిమియా తదితరులు పాల్గొని పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. తమకు రేషన్ కిట్లు అందజేసినందుకు కాలనీ వాసులు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు