ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన భేష్

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన భేష్

ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు)

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మండల పరిషత్ పాఠశాలలు ఆంగ్ల బోధనలో ముందున్నాయని,తల్లంపాడుప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని సర్పంచ్ అంబేద్కర్ అన్నారు.శనివారం ఖమ్మం రూరల్ పరిధి లోని ప్రభుత్వ  పాఠశాల తల్లంపాడు లో   జరిగిన స్కూల్ డే కమ్ ఫేర్వెల్ పార్టీ వేడుక సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. విద్యార్థుల ఆంగ్ల ఉపన్యాసం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.పాఠశాలకు కావలసిన సదుపాయాలను కల్పించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. పూర్వ ఉపాధ్యాయులు పీవీ రమణ పంపిణీచేసిన IMG-20260313-WA0107పరీక్ష ప్యాడ్ లను పెన్నులు విద్యార్థులకు అందించారు.సభకు అధ్యక్షత వహించిన పాఠశాల హెచ్ ఎం హైమావతి మాట్లాడుతూ ఎవ్రీ చైల్డ్ రీడింగ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయులు,కవి, కటుకోఝ్వల రమేష్ సభా సమన్వయం చేశారు. సభ ప్రారంభానికి ముందు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి,రాకేష్, విశ్రాంత ఉపాధ్యాయులు పీవీ రమణ,వార్డు కౌన్సిలర్లు అశోక్,కార్తీక్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు