పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
శంకర్ గౌడ్ వనపర్తి జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు
వనపర్తి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):
రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.కష్టపడి చదివిన విషయాలను ప్రశాంతంగా, ఆసక్తితో రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.సమయపాలన పాటిస్తూ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.అలాగే ప్రశ్నపత్రంలో సులభమైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలని తెలిపారు. హాల్ టికెట్ నంబర్ మరియు ప్రశ్న నంబర్లను సరిగా రాసి ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేస్తూ, సంక్షిప్తంగా సమాధానాలు రాయాలని తెలిపారు.గైడ్లపై ఆధారపడకుండా స్వయంగా అర్థం చేసుకున్న విషయాలను రాయడానికి ప్రయత్నించాలన్నారు. ఏ ప్రశ్నను వదలకుండా జాగ్రత్తగా సమాధానాలు రాయాలని, పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వంటివని పేర్కొన్నారు.విద్యార్థులు పరీక్షలను బాగా రాసి తమ తల్లిదండ్రులు, పాఠశాలలు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


Comments