ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్టకు తుమ్మలకు ఆహ్వానం.
Views: 38
On
- 25న సత్తుపల్లి హనుమాన్ నగర్లో మహోత్సవం.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందజేత.
- ఆలయ కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ.
సత్తుపల్లి, మార్చి 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఈనెల 25వ తేదీన సత్తుపల్లి హనుమాన్ నగర్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో గురువారం ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, కృష్ణారెడ్డి, కిట్టు, రఘు, సత్యం తదితరులు
పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 Mar 2026 17:47:28
ఖమ్మం బ్యూరో, మార్చి 12(తెలంగాణ ముచ్చట్లు)
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇద్దరు యువ మిత్రులు తమ ఉదారతను చాటుకున్నారు....


Comments