పెద్దమందడిలో న్యాయ సేవలు, వినియోగదారుల హక్కులపై అవగాహన 

పెద్దమందడిలో న్యాయ సేవలు, వినియోగదారుల హక్కులపై అవగాహన 

పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని రైతు వేదికలో న్యాయ సేవలు మరియు వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి రజిని  అధ్యక్షత వహించి ప్రజలకు న్యాయ సేవల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, న్యాయ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వినియోగదారుల హక్కుల గురించి ప్రజలకు వివరించి, సమస్యలు ఎదురైనప్పుడు న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసీల్దార్ పాండు నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు న్యాయ సేవలు, వినియోగదారుల హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, న్యాయవాది కృష్ణయ్య, జిల్లా న్యాయ సేవల సంస్థ సభ్యుడు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు న్యాయ సేవలపై అవగాహన పెంపొందించుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు