మనిగిల్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మనిగిల్ల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల నిర్వహణలో వివిధ బాధ్యతలను చేపట్టి తమ ప్రతిభను ప్రదర్శించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బి. శివ ప్రసాద్, జిల్లా కలెక్టర్గా డి. వైష్ణవి, జిల్లా విద్యాధికారిగా జి. కిరణ్ కుమార్, మండల విద్యాధికారిణిగా కె. నిత్య బాధ్యతలు నిర్వహించారు.కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల విద్యాధికారిణి మంజులత, గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ బేగం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల అనుభవాలను పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments