మానవత్వంతో ముందుకు వచ్చిన జె. వెంకటేష్ యాదవ్

వృద్ధాశ్రమానికి 100 కిలోల బియ్యం, కూరగాయల అందజేత

మానవత్వంతో ముందుకు వచ్చిన జె. వెంకటేష్ యాదవ్

కీసర, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర సర్కిల్ డివిజన్–1 పరిధిలోని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జె. వెంకటేష్ యాదవ్ ముందుకు వచ్చారు. వృద్ధులకు అవసరమైన 100 కిలోల బియ్యంతో పాటు కొన్ని కూరగాయలను సెరినిటీ పాఠశాల పీ.ఈ.టి ద్వారా వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, జె. వెంకటేష్ యాదవ్ చేసిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి వృద్ధులకు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మచ్చాని రాజు యాదవ్, ముద్దం మల్లేష్ యాదవ్, ఆర్.సి.ఎం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News