అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
Views: 3
On
ఉప్పల్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ బగాయత్లోని కాలభైరవ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలభైరవ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Mar 2026 21:25:17
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...


Comments