కుషాయిగూడలో పాన్, టీ షాప్‌లలో చోరీ

కుషాయిగూడలో పాన్, టీ షాప్‌లలో చోరీ

_తాళాలు పగలగొట్టి నగదు, సిగరెట్ ప్యాకెట్లు అపహరణ 

– కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

కుషాయిగూడ, మార్చ్ 18 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న పాన్ షాప్, టీ షాప్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. భరత్ నగర్ జమ్మిగడ్డకు చెందిన కంచు గంట్ల భాస్కర్ నిర్వహిస్తున్న ఈ షాప్‌లకు మార్చి 17న రాత్రి తాళాలు వేసి వెళ్లగా, మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా షట్టర్ తెరవబడి ఉండటం, తాళాలు పగలగొట్టబడటం గుర్తించాడు.షాప్‌లలోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు సిగరెట్ ప్యాకెట్లు, కొంత నగదు అపహరించబడినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ