తాళం పగులగొట్టి దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్

తాళం పగులగొట్టి దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్

కీసర, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆరుమళ్ల వెంకట్ రెడ్డి ఈ నెల 16న ఉదయం సుమారు 9 గంటలకు తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.అనంతరం మధ్యాహ్నం 12:05 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడినట్లు గుర్తించారు.ఈ ఘటనలో కీసర ప్రాంతానికి చెందిన బాల నేరస్థుడు దర్యాగుల జగదీష్ అలియాస్ సంతోష్ అలియాస్ సంతు ఇంట్లోకి చొరబడి, అల్మిరాలోని బంగారు ఉంగరాలు, చిన్న గొలుసు, చెవి దిద్దులు (మాటీలు) మరియు రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను దొంగిలించినట్లు తేలింది.పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి, మార్చ్ 18న బుధవారం రోజు నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కీసర పోలీసులు ప్రజలకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ