విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ 

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం

జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల పని వేళలు, సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.
చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో పెరుగుతున్న జనాభాతో ప్రతి వార్డులో పనిభారం అధికమవుతోందని తెలిపారు. అయినప్పటికీ పారిశుద్య కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ టీమ్ వర్క్‌తో ముందుకు సాగాలని సూచించారు. అలాగే తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలని సూచించారు.
శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న వారిలో ఉన్నత చదువులు చదివిన వారిని గుర్తించి, వారి అర్హతలకు అనుగుణంగా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్‌లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, చందా రాజు, చింతల శ్రీనివాస్, అజయ్ రావు, దిడ్డి రాము, శానిటరీ ఇన్స్పెక్టర్మహేష్, సదానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. IMG-20260318-WA0074

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ