భక్తి ఉత్సాహంతో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరపాలి

భక్తి ఉత్సాహంతో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరపాలి

హుజురాబాద్, మార్చి 22: (తెలంగాణ ముచ్చట్లు)

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలను భక్తి ఉత్సాహాలతో ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ హుజురాబాద్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని, నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను వైభవంగా జరపాలని సూచించారు. ప్రతి ఇంటిపై కాషాయ పతాకాలు ఎగరవేయాలని, దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కోరారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ముందుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానాలు, భజన మండళ్లు, హరికథలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.
గ్రామాల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే ఈ మహోత్సవాల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన కందికట్ల పద్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన కందికట్ల పద్మ
జమ్మికుంట టౌన్, మార్చ్ 22 (తెలంగాణ ముచ్చట్లు): హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన పద్మశాలి 2026 ఉగాది పురస్కార కార్యక్రమంలో జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన కందికట్ల...
భక్తి ఉత్సాహంతో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరపాలి
తెలంగాణ బడ్జెట్ 2026పై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో ఆగ్రహం
సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం 
వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు