పొంగులేటి ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకనే ఆరోపణలు

డాక్టర్ పిడమర్తి రవి,ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ 

పొంగులేటి ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకనే ఆరోపణలు

హన్మకొండ,మార్చి29(తెలంగాణ ముచ్చట్లు):

పొంగులేటి ప్రజాదరణను జీర్ణించుకోలేకనే ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి పేర్కొన్నారు. అసెంబ్లీలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని టిఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావుపై విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను చూసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.రాజకీయాల్లోకి రాకముందే వ్యాపార రంగంలో విజయవంతంగా ఎదిగి సంపాదించిన సంపదను ప్రజల సేవకే వినియోగించేందుకు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తన కష్టార్జితాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఆవరణగా ఉపయోగించుకుని కొందరు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. మైనింగ్ రంగంలో అక్రమాలు జరుగుతున్నాయన్న విషయంపై కూడా విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యవహారాలకు చోటు లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News