ఈసీఐఎల్‌ చౌరస్తాలో కార్మికుల నిరసన ర్యాలీ

ఈసీఐఎల్‌ చౌరస్తాలో కార్మికుల నిరసన ర్యాలీ

_పని గంటల పెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన

_ఏఐటీయూసీ నేతల పిలుపు

కుషాయిగూడ, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈసీఐఎల్‌లోని అంబేద్కర్ కూడలి వద్ద కార్మికులు “బ్లాక్ డే”గా పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్ మాట్లాడుతూ, ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని అన్నారు. ఇది చట్టాల మార్పు కాదని, కార్మిక హక్కులను అపహరించే చర్యలని విమర్శించారు. కార్మికుల శ్రమను చౌకగా మార్చి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ఈ కోడ్లు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.కొత్త కోడ్ల ద్వారా పని గంటలు పెరగడం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఉద్యోగ భద్రత క్షీణిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా 300 మందికి లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగాలను తొలగించే అవకాశం కల్పించడం ఆందోళనకరమని అన్నారు. యూనియన్ హక్కులపై పరిమితులు విధించడం వల్ల కార్మికుల స్వరాన్ని అణచివేస్తున్నారని విమర్శించారు.కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుదలతో పర్మినెంట్ ఉద్యోగాలు తగ్గిపోతాయని, వేతనాలు, బోనస్, సామాజిక భద్రత అంశాలు బలహీనపరుస్తున్నాయని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.నిరసన అనంతరం కుషాయిగూడ పోలీసులు ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ నేతలు ఎస్. శంకర్ రావు, నారా నర్సింహా, జోషి, రాఘవేంద్ర రావు, నర్సింహా రావు, లక్ష్మీనారాయణ, మోహన్, చలం, గండాలు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, టి. సత్య ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260401-WA0095

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం