వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.

డ్రైనేజీ, శుభ్రతపై ఆదేశాలు.

వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.

సత్తుపల్లి, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు):

పట్టణంలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా తెలిపారు. బుధవారం పట్టణంలోని 22వ వార్డులో ఆమె విస్తృతంగా పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పర్యటనలో భాగంగా వార్డు సభ్యులు, స్థానికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థలో పూడికతీత, కొత్త కాలువల నిర్మాణంపై చర్చించారు. చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డు సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. ప్రజల చెంతకే పాలన అందించడమే లక్ష్యమని, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.IMG-20260401-WA0079

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం