అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.

వలస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు 

అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.

వనపర్తి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ..రక్తదాతలు ప్రాణదాతలు అని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని, ఇది ఒకరి ప్రాణాన్ని కాపాడటంతో సమానం అని తెలిపారు.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చెప్పారు.ఈ శిబిరంలో బండారు శ్రీనివాస్ 19వ సారి రక్తదానం చేయడం విశేషం కాగా, రమేష్, వెంకటేష్ లను శంకర్ గౌడ్ అభినందించారు.కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి ప్రొఫెసర్ అరుణకుమారి, సీనియర్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ అవెంజలిన్, ఉద్యోగులు సంతోష్, లక్ష్మీ, పద్మ, సులోచన (గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్) తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.