అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.
వలస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు
వనపర్తి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ..రక్తదాతలు ప్రాణదాతలు అని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని, ఇది ఒకరి ప్రాణాన్ని కాపాడటంతో సమానం అని తెలిపారు.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చెప్పారు.ఈ శిబిరంలో బండారు శ్రీనివాస్ 19వ సారి రక్తదానం చేయడం విశేషం కాగా, రమేష్, వెంకటేష్ లను శంకర్ గౌడ్ అభినందించారు.కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి ప్రొఫెసర్ అరుణకుమారి, సీనియర్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ అవెంజలిన్, ఉద్యోగులు సంతోష్, లక్ష్మీ, పద్మ, సులోచన (గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్) తదితరులు పాల్గొన్నారు.


Comments