మార్కుల నిరుత్సాహంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి
_ఏఎస్రావు నగర్ నుంచి కాచిగూడ వరకు ట్రేస్
– మిస్సింగ్ కేసు నమోదు
జవహర్ నగర్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ జై జవాన్ కాలనీకి చెందిన చల్ల బాలాజీ (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 12 సాయంత్రం 7 గంటల సమయంలో బాలాజీ ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో డా .ఏ ఎస్ రావు నగర్ బస్ స్టాప్ వద్ద అతను కనిపించినట్లు పొరుగువారు తెలిపారు.ఇంటర్మీడియట్ పరీక్షల్లో 400కు పైగా మార్కులు వస్తాయని ఆశించిన బాలాజీకి సుమారు 300 మార్కులు రావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తల్లి చెల్లా సుబ్బలక్ష్మి పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఏప్రిల్ 13 ఉదయం 8 గంటలకు 7383680566 నంబర్ నుండి తన తల్లి కాల్ చేసి ఇంటికి రావాలని చెప్పినప్పటికీ బాలాజీ తిరస్కరించి కాల్ కట్ చేసినట్లు సమాచారం. తిరిగి సంప్రదించగా తాను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్లు తెలిసింది.తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలాజీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి.


Comments