వెల్టూర్ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
పెద్దమందడి,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు అంబేద్కర్ జీవిత గాధను, ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాన హక్కులు, విద్యా ప్రాధాన్యత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి గురించి వివరించారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.వేడుకల సందర్భంగా గ్రామంలో ఐక్యత, సోదరభావం ప్రతిఫలించాయి.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరణలో పెట్టాలని వక్తలు సూచించారు.ఈ కార్యక్రమం గ్రామంలో సామరస్య వాతావరణాన్ని మరింత బలోపేతం చేసింది. వేడుకల్లో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, గ్రామ ప్రజలు, నాయకులు, యువత, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.


Comments