శ్రీ ఆదర్శలో పది విద్యార్థులకు ఘన వీడ్కోలు.
Views: 3
On
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు )
చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం సోమవారం జరిగింది. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ సూచించారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ , అకుంఠిత దీక్ష, ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగినప్పుడు అనుకున్న గమ్యాన్ని చేరుతారని ఆయన తెలిపారు. విద్యార్థులు పాఠశాల తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు . ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు బోళ్ల రేణుక, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, పందిరి పుల్లారావు, సుధాకర్, ప్రశాంతి, పార్వతి, సుజాత, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Apr 2026 16:12:49
కుషాయిగూడ, ఏప్రిల్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుంచి ఐదు రోజుల గోవా యాత్రకు ప్రత్యేక...


Comments