శ్రీ ఆదర్శలో పది విద్యార్థులకు ఘన వీడ్కోలు.

శ్రీ ఆదర్శలో పది విద్యార్థులకు ఘన వీడ్కోలు.

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు )

చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థుల  వీడ్కోలు సమావేశం సోమవారం జరిగింది.  విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ సూచించారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.  విద్యార్థులు క్రమశిక్షణ , అకుంఠిత దీక్ష, ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగినప్పుడు  అనుకున్న గమ్యాన్ని చేరుతారని ఆయన తెలిపారు. విద్యార్థులు పాఠశాల తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు . ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.‌  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు బోళ్ల రేణుక, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, పందిరి పుల్లారావు, సుధాకర్, ప్రశాంతి,  పార్వతి, సుజాత,  త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News