చిన్నపెండ్యాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
చిల్పూర్,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డీజే ధ్వనులతో ఉత్సాహభరితంగా సాగిన ఈ ర్యాలీలో “జై భీం” నినాదాలతో గ్రామం మార్మోగింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీల రాజు, బత్తుల రాజన్ బాబు, తాళ్లపల్లి శివ కుమార్, రామడుగు బుచ్చి కొమురయ్య, కొత్తపల్లి యాకరాజు, ఇల్లందుల యాదగిరి, గడ్డమీది మహేందర్, ఇల్లందుల హరిబాబు, చుక్క రాజేష్, బొల్లెపాక
శ్రీనివాస్, గడ్డమీద ఎల్లయ్య, గడ్డమీద సురేష్, ఇల్లందుల విజయ్, ఇల్లందుల శ్రీకాంత్, ఇల్లందుల రాజు, బొల్లెపాక రమేష్, చుక్క రాంబాబు, చుక్క మార్కు తదితరులు పాల్గొన్నారు.


Comments