సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన…
ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం.
పెద్దమందడి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వీణ్ గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజర్ల కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న 7 రోజుల జాతీ
య సేవా పథక (ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం రెండో రోజు కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయం, నేల మట్టి మరియు నీటి పరీక్షలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ పి. గజానంద్ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారం పెరుగుతుందని, వంటగది వ్యర్థాలను కంపోస్ట్గా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వర్మి కంపోస్ట్ వినియోగంతో రసాయనాలపై ఆధారపడకుండా, పెస్టిసైడ్ వినియోగం తగ్గుతుందని వివరించారు.విద్యార్థులు భార్గవ్, అనూష, అంజలి, సింధు తదితరులు సేంద్రియ వ్యవసాయం పద్ధతులు, నేల మట్టి మరియు నీటి నమూనాల సేకరణ విధానాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్. రామకృష్ణ, ఉప సర్పంచ్ పి. సుజాత ఆనంద్, పంచాయతీ సెక్రెటరీ పి. రామ్ చరణ్, భూసార పరీక్ష నిపుణుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments