సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన…

ఎన్‌ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం.

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన…

పెద్దమందడి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వీణ్ గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజర్ల కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న 7 రోజుల జాతీIMG-20260413-WA0101య సేవా పథక (ఎన్‌ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం రెండో రోజు కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయం, నేల మట్టి మరియు నీటి పరీక్షలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ పి. గజానంద్ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారం పెరుగుతుందని, వంటగది వ్యర్థాలను కంపోస్ట్‌గా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వర్మి కంపోస్ట్ వినియోగంతో రసాయనాలపై ఆధారపడకుండా, పెస్టిసైడ్ వినియోగం తగ్గుతుందని వివరించారు.విద్యార్థులు భార్గవ్, అనూష, అంజలి, సింధు తదితరులు సేంద్రియ వ్యవసాయం పద్ధతులు, నేల మట్టి మరియు నీటి నమూనాల సేకరణ విధానాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్. రామకృష్ణ, ఉప సర్పంచ్ పి. సుజాత ఆనంద్, పంచాయతీ సెక్రెటరీ పి. రామ్ చరణ్, భూసార పరీక్ష నిపుణుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.