సర్వాయి పాపన్నకు ఘన నివాళి

సర్వాయి పాపన్నకు ఘన నివాళి

_ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు ఆలస్యం పై నేతల ఆగ్రహం

_బీసీలకు న్యాయం చేయాలని, పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని డిమాండ్

కుషాయిగూడ, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలో మేడ్చల్ మల్కాజిగిరి గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, భక్తులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఎక్స్‌గ్రేషియా నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. బీసీ నాయకుడు గోగికర్ శివకుమార్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు అన్యాయం జరిగితే సహించబోమని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.మరో నేత విద్యాసాగర్ బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు తగినంతగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి బుడంపల్లి నిరంత్ గౌడ్, మిట్టపల్లి విజయ్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రత్నపురం వెంకటేశ్వర్లు, రఘుపతి గౌడ్, గణేష్, రామకృష్ణ, పాండు గౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…