శ్రీ సాయి రేడియేటర్ వద్ద చలివేంద్రం ప్రారంభం
Views: 3
On
కుషాయిగూడ, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో కుషాయిగూడ పోచమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సాయి రేడియేటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందించడం అత్యంత అవసరమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా సమాజ సేవకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో శ్రీ సాయి రేడియేటర్ ప్రొప్రైటర్ దోమ శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి విజయ్ కుమార్ రెడ్డి, ధర్మారెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, శివారెడ్డి, అర్జున్, నాని, నరేష్, తేజ, రామ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Apr 2026 21:59:21
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...


Comments