సిర్సపల్లి పల్లె దవాఖానాపై ఆకస్మిక తనిఖీ… సేవల్లో మెరుగుదలకు సూచనలు

సిర్సపల్లి పల్లె దవాఖానాపై ఆకస్మిక తనిఖీ… సేవల్లో మెరుగుదలకు సూచనలు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రవణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానా పనితీరు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
సిబ్బంది సమయపాలనకు కట్టుబడి పనిచేయాలని ఆయన ఆదేశించారు. రోగులకు అవసరమైన బీపీ, షుగర్ మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
ప్రస్తుత వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిహైడ్రేషన్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామస్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…