గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం.!

గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం.!

- అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచన.
-  ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.

దమ్మపేట, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దమ్మపేట మండలంలోని పలు గ్రామపంచాయతీలలో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే గ్రామసభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.IMG-20260402-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…