క్రీస్తు త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే.
విశ్వశాంతి విద్యాలయంలో ముందస్తు నిర్వహణ.
సత్తుపల్లి, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే అని పట్టణంలో విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పాఠశాలలో గురువారం ముందస్తుగా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, దయ, సహనం వంటి విలువలపై ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే మనుషులకు కష్టకాలంలో ధైర్యంగా ఉండటం, ఇతరులను క్షమించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి గొప్ప గుణాలను నేర్పుతుందని పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక, మానవీయ విలువలు కూడా సమానంగా అవసరమని విద్యార్థులకు సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం నరుకుళ్ల సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments