పీచర సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహణ
వేలేరు ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పీచర గ్రామంలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల ఎంపిడిఓ లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మరిజే అనిత- నరసింహారావు అధ్యక్షతన సభను ప్రారంభించారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తోట అనిల్, వార్డు సభ్యులు,వైద్య సిబ్బంది,అంగన్ వాడి టీచర్స్, గ్రామ అధికారులు,మహిళా సంఘాలు,గ్రామస్థులు పాల్గొన్నారు.


Comments