ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
_జై దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
_వివిధ కాలనీల భక్తుల విస్తృత పాల్గొనడం
– పులిహోర, పనకం పంపిణీ
కుషాయిగూడ, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా జై దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నగర్, ఇందిరానగర్, లక్ష్మి నరసింహస్వామి కాలనీ, ఎంఆర్ఆర్ కాలనీ, ద్వారకాపురి కాలనీ, మధురానగర్ కాలనీలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు.కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించి హనుమంతుడి మహిమను స్మరించుకున్నారు. అనంతరం భక్తులకు పులిహోర, పనకం, రసం ప్రసాదంగా పంపిణీ చేశారు.కార్యక్రమం మొత్తం భక్తి వాతావరణంలో సాగి, ప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.స్థానిక యువత సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.


Comments