“ఒక్క క్షణం లో విషాదం… పల్టీలు కొట్టిన ఆటో, డ్రైవర్ మృతి”
Views: 1
On
జమ్మికుంట టోన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటకు వెళ్తున్న ఆటో పెద్దంపల్లి మూలమలుపు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తేలుకుంట శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో డ్రైవర్కు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Apr 2026 21:59:21
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...


Comments