పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామంలో ఆంధ్రజ్యోతి జిల్లా ఇంచార్జ్ భాస్కర్ కుమార్తె పట్టు చీర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి ఆరాధ్యకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు వెలుగొందాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, జగత్పల్లి గ్రామ సర్పంచ్ వెంకన్న యాదవ్, సింగల్ విండో డైరెక్టర్ మన్యం, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, నందిమల్ల రాము, ద్వారపోగు విజయ్ బాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Comments