మల్లాపూర్లో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం.
_భవాని నగర్లో పనులు ప్రారంభం
– బస్తీ బాటలో ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకులు
మల్లాపూర్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. “బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా భవాని నగర్లోని స్ట్రీట్ నెం. 3, 15 ప్రాంతాలను సందర్శించిన స్థానిక నాయకుడు నెమలి అనిల్ కుమార్, అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు డ్రైనేజీ స్తంభించడంతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వివరించారు.సమస్యపై వెంటనే స్పందించిన అనిల్ కుమార్, సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు చేపట్టేలా చేశారు.అనంతరం అధికారులతో కలిసి ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన, భవాని నగర్లో కొత్త డ్రైనేజీ పైపుల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాథమిక వసతులు అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Comments