ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.

పామిరెడ్డిపల్లిలో పాఠశాలపై సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.

పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల హాజరు మరియు బోధన పరిస్థితులపై ఆరా తీశారు.తదనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం వడ్డించాలని వంట సిబ్బందికి స్పష్టంగా సూచించారు.భోజనంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.అదేవిధంగా పాఠశాల ఆవరణ పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ, పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ తిరుపతిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు మధిర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి. ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)   వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...
అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ