గంగారం సెక్టార్లో డీ.డబ్ల్యూ.ఓ ఆకస్మిక పర్యటన.
- అంగన్వాడీల పనితీరుపై ప్రశంసలు.
- చిన్నారులతో ముచ్చటించిన విజేత.
సత్తుపల్లి, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని గంగారం గ్రామం సెక్టార్లో అంగన్వాడీ కేంద్రాలను జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) విజేత మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రాలకు వెళ్లిన ఆమె చిన్నారులతో కూర్చొని మాట్లాడారు. “గుడ్లు సమయానికి ఇస్తున్నారా? ఆటలు ఆడిస్తున్నారా?” అని అడగగా, పిల్లలు ఆనందంగా “రోజూ ఇస్తున్నారు, ఆటలు కూడా ఆడిస్తున్నారు” అని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల బరువును తూకం వేసి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎలాంటి అక్రమ చెల్లింపులు చేస్తున్నారా అని ప్రశ్నించగా, అలాంటివి ఏవీ లేవని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా విజేత మాట్లాడుతూ, ఎక్కడైనా విధుల్లో
నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తనిఖీల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని, కేంద్రాల పనితీరు బాగుందని తెలిపారు.


Comments