గంగారం సెక్టార్‌లో డీ.డబ్ల్యూ.ఓ ఆకస్మిక పర్యటన.

గంగారం సెక్టార్‌లో డీ.డబ్ల్యూ.ఓ ఆకస్మిక పర్యటన.

- అంగన్వాడీల పనితీరుపై ప్రశంసలు.
- చిన్నారులతో ముచ్చటించిన విజేత.

సత్తుపల్లి, ఏప్రిల్‌ 21(తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని గంగారం గ్రామం సెక్టార్‌లో అంగన్వాడీ కేంద్రాలను జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) విజేత మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రాలకు వెళ్లిన ఆమె చిన్నారులతో కూర్చొని మాట్లాడారు. “గుడ్లు సమయానికి ఇస్తున్నారా? ఆటలు ఆడిస్తున్నారా?” అని అడగగా, పిల్లలు ఆనందంగా “రోజూ ఇస్తున్నారు, ఆటలు కూడా ఆడిస్తున్నారు” అని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల బరువును తూకం వేసి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అలాగే లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎలాంటి అక్రమ చెల్లింపులు చేస్తున్నారా అని ప్రశ్నించగా, అలాంటివి ఏవీ లేవని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా విజేత మాట్లాడుతూ, ఎక్కడైనా విధుల్లో IMG-20260421-WA0089నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తనిఖీల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని, కేంద్రాల పనితీరు బాగుందని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి. ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)   వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...
అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ