మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
Views: 3
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లావ్యాప్తంగా నిర్వహించే మేడే వారోత్సవాలను ఏప్రిల్ 23 నుంచి మే 1 వరకు విజయవంతంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి కార్మికులను కోరారు.
హుజురాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఎర్రజెండా ఎగురవేసి కార్మిక ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను రక్షించే విధానాలను ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడే వారోత్సవాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను ప్రదర్శించాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Apr 2026 22:13:18
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...


Comments