పీచరలో కాంగ్రెస్ కమిటీల ఎన్నికలు విజయవంతం.
Views: 2
On
వేలేరు, ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు, పీచర గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ, యూత్ కమిటీ మరియు బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించగా
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సేవే ప్రధాన లక్ష్యంగా నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ ఏడెపల్లి సిద్ధులు,గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పెండ్లి వెంకటేష్,గ్రామశాఖ ఉపాధ్యక్షులు చెట్కూరి తిరుపతి, కార్యదర్శి మంతపురి శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి దామెర నరేష్, కోశాధికారి వేముల సురయ్యలను ఎన్నుకున్నారు
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో పీచర గ్రామం మరింత అభివృద్ధి సాధించాలని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Apr 2026 21:52:14
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అదుపు తప్పింది. ఇసుక దొరకడం కష్టంగా మారడంతో...


Comments